రైతులు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-11-24T00:48:44+05:30 IST

వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సహకారం సంఘం అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఇందిర అన్నారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఇందిర

కోదాడ రూరల్‌, నవంబరు 23: వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సహకారం సంఘం అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఇందిర అన్నారు. కోదాడ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మండలంలోని తమ్మర గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్‌ ఆవుల రామారావుతో కలిసి ఆమె బుధవారం పరిశీలించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఆధారంగా కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని అన్నారు. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తా మని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం వెంటనే నగదు జమ చేస్తున్నందున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు అన్ని రకాల ధ్రువపత్రాలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో చాంద్‌బి, సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T00:48:48+05:30 IST