అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2022-06-11T06:51:23+05:30 IST

ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములుకావాలని పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌ కోరారు.

అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి
చిమిర్యాలలో పల్లె ప్రకృతివనాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌

 పంచాయతీరాజ్‌శాఖ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌ 

సంస్థాన్‌ నారాయణపురం, చౌటుప్పల్‌ రూరల్‌, జూన్‌ 10: ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములుకావాలని పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌ కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని చిమిర్యాల, చిల్లాపురం, కొర్రతం డా, కడపగండి తండాలో  పర్యటించారు. పల్లె ప్రకృతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన డంపింగ్‌ యార్డు లు, వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతి వణాలను పరిశీలిం చి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచులు దోనూర్‌ జైపాల్‌ రెడ్డి, దోటి  మంజుల, కొర్ర లచ్చిరాం, కరెంటోతు సాలా శంకర్‌, ఎంపీడీవో బి. యాదగిరి తదితరులు పా ల్గొన్నారు. అదేవిధంగా చౌటుప్పల్‌ మండలం చింతగూ డెం, ఎస్‌.లింగోటం గ్రామాల్లో రవీందర్‌ పర్యటించి, ఐదో విడత పల్లెప్రగతి పనులను పరిశీలించారు.  

Updated Date - 2022-06-11T06:51:23+05:30 IST