ప్రమాదకర పరిశ్రమను అడ్డుకోవాలి
ABN , First Publish Date - 2022-09-26T06:13:35+05:30 IST
కృష్ణానది ఒడ్డున నిర్మిస్తున్న ప్రమాదకర పరిశ్రమ ఏర్పాటును అడ్డుకోవాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర బాధ్యుడు హరిందర్, తెలంగాణ మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు పిలుపునిచ్చారు. మండలంలోని వాడపల్లి, ఇర్కిగూడెం, దామరచర్ల గ్రామాల్లో వారు ఆదివారం పర్యటించి మా ట్లాడారు.
మానవ హక్కుల వేదిక
దామరచర్ల, సెప్టెంబరు 25: కృష్ణానది ఒడ్డున నిర్మిస్తున్న ప్రమాదకర పరిశ్రమ ఏర్పాటును అడ్డుకోవాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర బాధ్యుడు హరిందర్, తెలంగాణ మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు పిలుపునిచ్చారు. మండలంలోని వాడపల్లి, ఇర్కిగూడెం, దామరచర్ల గ్రామాల్లో వారు ఆదివారం పర్యటించి మా ట్లాడారు. కృష్ణా నది ఒడ్డున ఇర్కిగూడెం సమీపంలో ప్ర మాదకరమైన సోడియం శాకరిన్ ఉత్పత్తి చేసే పరిశ్రమ ను నిర్మించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. అక్టోబరు 10న పరిశ్రమ ఏర్పాటుపై నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పరిశ్రమ వ్యతిరేక పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మధు ఆకాశ్, జనవిఙ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు శ్రీనివాస్, అమరయ్య, కోట్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.