ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఛత్రపతి చౌహాన

ABN , First Publish Date - 2022-11-30T00:14:40+05:30 IST

ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా మండలంలోని ఎల్లారెడ్డిగూడెంకు చెందిన ఎం జీయూ విద్యార్థి ఛత్రపతి చౌహాన నియమితులయ్యారు.

ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఛత్రపతి చౌహాన

నార్కట్‌పల్లి, నవంబరు 29: ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా మండలంలోని ఎల్లారెడ్డిగూడెంకు చెందిన ఎం జీయూ విద్యార్థి ఛత్రపతి చౌహాన నియమితులయ్యారు. ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన రాజధాని జైపూర్‌లో జరిగిన 68వ జాతీయ మహాసభల సందర్భంగా ప్రకటించిన నూతన జాతీయ కార్యవర్గంలో చౌహానకు చోటులభించింది. చౌహాన ఎంజీయూలో ఎంబీఏ చదువుతున్నాడు. ఈ సందర్భంగా చౌహాన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు.

Updated Date - 2022-11-30T00:14:43+05:30 IST