విద్యుతశాఖ అవినీతిపై ఏసీబీ విచారణ

ABN , First Publish Date - 2022-04-24T05:47:33+05:30 IST

విద్యుతశాఖ డీఈ కా ర్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై శనివారం హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.

విద్యుతశాఖ అవినీతిపై ఏసీబీ విచారణ

మిర్యాలగూడ అర్బన, ఏప్రిల్‌ 23: విద్యుతశాఖ డీఈ కా ర్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై శనివారం హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. మార్చి 22న ఏసీబీ దాడుల విషయమై పట్టణంలోని డీఈ కార్యాలయంలో హైదరాబాద్‌ ఏసీబీ కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు పలువురిని విచారణ చేసి వివరాలను నమోదు చేసుకున్నా రు. మరోవైపు ఏసీబీకి ఫిర్యాదు చేసిన లైనమన గుంటూరు శ్రీనివాస్‌ నుంచి సైతం జడ్జి సమక్షంలో వివరాలు సేకరించారు. 

Updated Date - 2022-04-24T05:47:33+05:30 IST