వెంకన్న సేవలో ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2022-02-19T07:16:40+05:30 IST

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఉదయం తిరుమల

వెంకన్న సేవలో ఎమ్మెల్సీ కవిత

తిరుమల, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా గురువారం రాత్రి తిరుమలకు వచ్చిన ఆమె.. శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వదించగా, అఽధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. 


Updated Date - 2022-02-19T07:16:40+05:30 IST