Satyavati rathod: బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు

ABN , First Publish Date - 2022-09-27T19:36:09+05:30 IST

బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

Satyavati rathod: బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు

హైదరాబాద్: బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyvati rathod) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి ఉక్కును ఇతర ప్రాంతాలకు తరలించవద్దని స్థానిక ప్రజలు ఉద్యమించారని తెలిపారు. దాంతో బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని గతంలో ప్రభుత్వం (Telangana government) హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ నిన్నటి కేంద్ర మంత్రి ప్రకటన ఆందోళనకరంగా ఉందన్నారు. కిషన్ రెడ్డి(Kishan reddy) అది సాధ్యం కాదని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. అసలు కిషన్ రెడ్డి (Union minister) తెలంగాణ బిడ్డేనా అనే అనుమానం వస్తుందన్నారు. ఉత్సవ విగ్రహంలా కిషన్ రెడ్డి (BJP Leader) పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంపై కేంద్రం నిర్ణయాలు గిరిజనులకు అన్యాయం జరిగేలా ఉన్నాయన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందే బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు సమీక్షించుకోవాలని సూచించారు. ‘‘మీకు ఘోరీ ఎలా కట్టాలో మాకు తెలుసు’’ అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ (telangana minister) వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-09-27T19:36:09+05:30 IST