KTR Comments: పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నారు
ABN , First Publish Date - 2022-09-17T17:01:41+05:30 IST
నాలుగు దశలుగా తెలంగాణ ఉద్యమం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల: నాలుగు దశలుగా తెలంగాణ ఉద్యమం జరిగిందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఇడ్లి సాంబార్ గో బ్యాక్, సాయుధ పోరాటం, తొలి దఫా ఉద్యమం, కేసీఆర్ (CM KCR) హయాంలో మరోసారి ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. కాగా పోరాట చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మత పిచ్చి మంటల కోసం ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పచ్చని పంటలతో తెలంగాణ (Telangana) ముందుకు వెళ్తోందని, విద్వేష కర కుట్రలను తిప్పికొట్టాలని తెలిపారు. మనది వసుధైక కుటుంబమని మంత్రి కేటీఆర్ (Telangana minister) అన్నారు.