ఆ విషానికి విరుగుడు సీఎం కేసీఆర్ : Gangula
ABN , First Publish Date - 2022-09-29T20:03:36+05:30 IST
తెలంగాణ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతలకు కళ్ళు మండుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ : తెలంగాణ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతలకు కళ్ళు మండుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తే నీళ్ళు, కరెంట్ ఎత్తుకుపోతారన్నారు. ఢిల్లీ పార్టీలు (Delhi Parties) తెలంగాణ (Telangana)పై విషం చిమ్ముతున్నాయన్నారు. ఆ విషానికి విరుగుడు సీఎం కేసీఆర్ (CM KCR) అని గంగుల పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకోవాలన్నారు. కేసీఆర్ లేకుంటే భవిష్యత్ తరాల జీవితాలు అంధకారంగా మారుతాయని గంగుల పేర్కొన్నారు.