TS News: బీఆర్‌ఎస్ పార్టీ బైక్‌ ర్యాలీలో టపాసులు పేలిన ఘటనలో యువకుడు మృతి

ABN , First Publish Date - 2022-11-16T15:13:28+05:30 IST

జిల్లాలో బీఆర్‌ఎస్ ద్విచక్ర వాహన ర్యాలీలో టపాసులు పేలిన ఘటనలో గాయపడిన యువకుడు మృతి చెందాడు.

TS News: బీఆర్‌ఎస్ పార్టీ బైక్‌ ర్యాలీలో టపాసులు పేలిన ఘటనలో యువకుడు మృతి

సంగారెడ్డి: జిల్లాలో బీఆర్‌ఎస్ బైక్ ర్యాలీలో సందర్భంగా టపాసులు పేలిన ఘటనలో గాయపడిన యువకుడు మృతి చెందాడు. సంగారెడ్డి మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం బీఅర్ఎస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో టపాకాయలు పేలుస్తుండగా ప్రమాదవశాత్తు పక్క నుండి వెళ్తున్న ఆటోలో టపాసులు పడ్డాయి. దీంతో ఆటోకు నిప్పు అంటుకోవడంతో పాటు అందులో ఉన్న సిద్ధార్థ్ అనే వ్యక్తికి మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాధితుడిని కంచన్ బాగ్‌లోని డీఆర్డిఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ సిద్ధార్థ్ మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

Updated Date - 2022-11-16T15:27:25+05:30 IST