శ్రమ దోపిడీ చేస్తున్నారని కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2022-09-20T04:54:00+05:30 IST

కొంత కాలంగా ఎస్‌జీ చిప్స్‌ పరిశ్రలో పని చేస్తున్న తాము శ్రమ దోపిడికి గురవుతున్నామని రెండు వందల మంది కార్మికులు సోమవారం మండలంలోని కామారం శివారు చిన్నశంకరంపేట-నార్సింగి రహదారిపై గంట పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

శ్రమ దోపిడీ చేస్తున్నారని కార్మికుల ఆందోళన
చిన్నశంకరంపేట-నార్సింగి రహదారిపై ఆందోళన చేస్తున్న కార్మికులు

చిన్నశంకరంపేట, సెప్టెంబరు 19: కొంత కాలంగా ఎస్‌జీ చిప్స్‌ పరిశ్రలో పని చేస్తున్న తాము శ్రమ దోపిడికి గురవుతున్నామని రెండు వందల మంది కార్మికులు సోమవారం మండలంలోని కామారం శివారు చిన్నశంకరంపేట-నార్సింగి రహదారిపై గంట పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఎస్‌జీ చిప్స్‌ పరిశ్రమలో స్థానిక కార్మికులు, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన రెండు వందల మంది కార్మికులు పని చేస్తున్నారు. పనికి దగ్గ వేతనం ఇవ్వకుండా, అధిక సమయంతో పనులు చేయిస్తున్నారని కార్మికులు కామారం సర్పంచ్‌ యాదగిరియాదవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరించాలని పరిశ్రమ యాజమాన్యానికి తెలిపినా పట్టించుకోకపోవడంతో రహదారిపై కార్మికులతో కలిసి ఆందోన చేపట్టారు. ఎస్‌ఐ    సుభా్‌షగౌడ్‌ పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. 


Updated Date - 2022-09-20T04:54:00+05:30 IST