‘డబుల్’ ఇళ్ల కేటాయింపులో జాప్యం ఎందుకు?’
ABN , First Publish Date - 2022-03-17T04:25:20+05:30 IST
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో జాప్యం ఎందుకని, నిరుపేదలైన స్థానికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎప్పుడు కేటాయిస్తారో చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్డిమాండ్ చేశారు.
పటాన్చెరు రూరల్, మార్చి 16: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో జాప్యం ఎందుకని, నిరుపేదలైన స్థానికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎప్పుడు కేటాయిస్తారో చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్డిమాండ్ చేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు ఎలవర్తి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో కర్ధనూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బుధవారం పరిశీలించారు.