TS News: సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యం

ABN , First Publish Date - 2022-11-16T14:09:47+05:30 IST

జిల్లాలోని అమీన్‌పూర్‌ కేఎస్ఆర్ కాలనీకి చెందిన సాయిపవన్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యం కలకలం రేపుతోంది.

TS News: సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యం

సంగారెడ్డి: జిల్లాలోని అమీన్‌పూర్‌ కేఎస్ఆర్ కాలనీకి చెందిన సాయిపవన్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యం కలకలం రేపుతోంది. ఆన్‌లైన్ ద్వారా రూ.10 లక్షలు ఇన్వస్ట్‌మెంట్ చేసి సాయిపవన్ నష్టపోయాడు. కుటుంబ సభ్యులకు విషయం తెలిసి మందలించడంతో ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-11-16T14:09:48+05:30 IST