గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌లో రూ.9,040 పలికిన పత్తి ధర

ABN , First Publish Date - 2022-11-11T22:44:48+05:30 IST

గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి క్వింటాల్‌ ధర రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.9,040 పలికింది.

గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌లో రూ.9,040 పలికిన పత్తి ధర

గజ్వేల్‌, నవంబరు 11 : గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి క్వింటాల్‌ ధర రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.9,040 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 13.29 క్వింటాళ్ల పత్తి రాగా గరిష్టంగా రూ.9,040, కనిష్టంగా రూ.8,750 పలికింది. మక్కలకు అత్యధికంగా రూ.2,280 ధర పలకగా, అత్యల్పంగా 2,220 పలికింది. తేమశాతం లేకుండా ఆరబెట్టి తీసుకువచ్చి, మంచి ధరను పొందాలని గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు.

Updated Date - 2022-11-11T22:44:49+05:30 IST