డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఖాళీ బిందెలతో నిరసన
ABN , First Publish Date - 2022-12-30T23:53:10+05:30 IST
తూప్రాన్ పట్టణంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద శుక్రవారం పేదలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
తూప్రాన్, డిసెంబరు 30: తూప్రాన్ పట్టణంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద శుక్రవారం పేదలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తూప్రాన్ డబుల్ బెడ్ రూం ఇళ్లకు 15 రోజులుగా తాగునీటి సరఫరా సక్రమంగా కావడంలేదు. మిషన్ భగీరథ పైపులైన్లు పగిలిపోయి, లీకేజీలు అవుతున్నాయి. తాగునీటి సరఫరా చేయాలని పేదలు మున్సిపల్ అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. పేదలు పొలాల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం ఉదయం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.