మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలను శుభ్రంగా ఉంచాలి

ABN , First Publish Date - 2022-07-04T05:17:50+05:30 IST

మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి పాఠశాల సిబ్బందికి సూచించారు.

మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలను శుభ్రంగా ఉంచాలి

సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి

సిద్దిపేట టౌన్‌, జూలై 3: మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి పాఠశాల సిబ్బందికి సూచించారు. ఆదివారం సిద్దిపేట పట్టణ శివారులోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలను ఆయన సందర్శించి పాఠశాలలోని టాయిలెట్‌, వంటశాల, తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. వెంటనే అన్ని గదులను శుభ్రం చేయాలని అవసరమైతే సిబ్బంది అంతా కలిసి శ్రమదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మల్లికార్జున్‌, సిబ్బంది ఐలయ్య, అన్వే్‌షరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు గోపయ్య, సతీష్‌ పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ కవర్లు వాడితే కఠిన చర్యలు

సిద్దిపేట టౌన్‌, జూలై 3: ప్టాస్టిక్‌ కవర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని పలు దుకాణాలు, పలు సూపర్‌ మార్కెట్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రిలయన్స్‌ స్మార్ట్‌లో సింగిల్‌ యూజుడ్‌ ప్లాస్టిక్‌ను వినియోగిస్తుండటంతో రూ.5 వేల జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మల్లికార్జున్‌, హరితహారం ప్రత్యేకాధికారి ఐలయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-04T05:17:50+05:30 IST