‘మన ఊరు- మన బడి’ని జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2022-12-10T00:04:19+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’, ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్‌ జిల్లా ప్రాజెక్టు ఏఎ్‌సవో శశిధర్‌ పేర్కొన్నారు.

‘మన ఊరు- మన బడి’ని జయప్రదం చేయాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న మెదక్‌ జిల్లా ప్రాజెక్టు ఏఎ్‌సవో శశిధర్‌

చిల్‌పచెడ్‌, డిసెంబరు 9: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’, ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్‌ జిల్లా ప్రాజెక్టు ఏఎ్‌సవో శశిధర్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమానికి సంబంధించిన పనుల ప్రగతిని తెలుసుకునేందుకు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రాజెక్టు డైరెక్టరు శశిధర్‌, ఎంఈవో బుచ్చానాయక్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, హాజరు కొనసాగింపుతో పాటు విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యాలను మెరుగునకు, మౌళిక వసతుల ఏర్పాటు కోసం రూపొందించిన ఈ పథకాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ నెల చివరి వరకు ప్రతీ పాఠశాలలో 100 శాతం పనులు పూర్తిచేయాలని, ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో నోడల్‌ అధికారి విఠల్‌, ఆయా గ్రామాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:04:20+05:30 IST