చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలి

ABN , First Publish Date - 2022-07-06T05:23:34+05:30 IST

చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం చేర్యాలలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలి

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఎం, సీపీఐ నాయకులు

చేర్యాల, జూలై 5: చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం చేర్యాలలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గాంధీచౌక్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు అందె అశోక్‌ మాట్లాడారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మారుమూల నుంచి అభివృద్ధికి నోచుకోని చేర్యాల సీఎం కేసీఆర్‌ సొంత జిల్లాలో చేర్చుకున్నా అంతకు రెట్టింపు వివక్ష కొనసాగిస్తుండడం తగదన్నారు. అనంతరం తహసీల్దార్‌ ఆరీఫాబేగంకు వినతిపత్రం అందజేశారు. 

కొమురవెల్లిలో

రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కొమురవెల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2022-07-06T05:23:34+05:30 IST