జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగొద్దు

ABN , First Publish Date - 2022-02-20T05:24:19+05:30 IST

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు

జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
ఏడుపాయలలో జాతర పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి

మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి 

 

పాపన్నపేట: గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఏడుపాయల జాతర ఏర్పాట్లపై పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లిలోని హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్సీ శేరీ సుభా్‌షరెడ్డి, అదనపు కలెక్టర్‌ రమే్‌షతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 1న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏడుపాయల జాతరకు తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఎటువంటి ఘటనలకు తావివ్వకుండా ఈనెల 26లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆదేశించారు.జాతరలో వివిధ శాఖలు వారు చేపట్టే కార్యక్రమాలు, వాటి ప్రగతిని తెలుసుకుంటూ ఆమె పలు సూచనలు చేశారు. జాతరకు రెండు విడతలుగా 0.45టీఎంసీ నీటిని విధుల చేయిస్తామని ఆమె తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు సాయిరాం, వెంకట ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ చందనా ప్రశాంత్‌రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-20T05:24:19+05:30 IST