జహీరాబాద్లో బ్లడ్బ్యాంక్ను ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2022-12-10T00:02:11+05:30 IST
డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
జహీరాబాద్, డిసెంబరు 9: జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్బ్యాంక్ను ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం డీవైఎ్ఫఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నాయకుడు తిరుపతి మాట్లాడుతూ.. అతిపెద్ద నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో వంద పడకల ఏరియా ఆసుపత్రి ఉన్నప్పటికీ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయకపోవడం దారుణం అన్నారు. చాలామంది నిరుపేదలకు రక్తనిధి అందుబాటులో ఉండడం లేదన్నారు. అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగానే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఇప్పటివరకు బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయలేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామీణ, పట్టణ ప్రజల సౌకర్యార్థమై బ్లడ్బ్యాంకును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎ్ఫఐ ఎస్ఎ్ఫఐ నాయకులు రాజేష్, హరీష్, మల్లేష్ పాల్గొన్నారు.