డ్రంకెన్ డ్రైవ్లో 14 మందికి జరిమానా
ABN , First Publish Date - 2022-07-19T05:19:53+05:30 IST
సిద్దిపేట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ షకీల్ హైమద్ తమ సిబ్బందితో కలిసి నాలుగురోజుల నుంచి సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్, ఎంపీడీవో చౌరస్తాల్లో, రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ నిర్వహించారు.

సిద్దిపేట క్రైం, జూలై 18: సిద్దిపేట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ షకీల్ హైమద్ తమ సిబ్బందితో కలిసి నాలుగురోజుల నుంచి సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్, ఎంపీడీవో చౌరస్తాల్లో, రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో 14 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని సోమవారం ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి రమే్షబాబు ఎదుట హాజరుపర్చగా విచారణ చేసి 14 మందికి రూ.31,500 జరిమానా, వారిలో ఒకరికి 3 రోజులు, మరొకరికి ఒకరోజు జైలు శిక్ష విధించారు.