TS News: వరంగల్‌లో మావోయిస్టుల లేఖ కలకలం

ABN , First Publish Date - 2022-08-31T17:28:25+05:30 IST

జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది.

TS News: వరంగల్‌లో మావోయిస్టుల  లేఖ కలకలం

వరంగల్: జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి పోలీసులు ఇచ్చే డబ్బులు, ప్రలోభాలకు ఆశపడి వ్యాపారస్తులు ఇన్ ఫార్మర్ గా మారొద్దంటు లేఖ విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi), అమిత్ షా (Amith shah), రాజ్ నాథ్ సింగ్ (Rannathsingh) ముఠా ఇన్ ఫార్మర్ నెట్వర్క్‌ను పెంచి పోషిస్తూ 2022 వరకు విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించాలనే పథకం పన్నుతున్నారని తెలిపారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ప్రమోషన్లకు, రివార్డులకు కక్కుర్తి పడి టీఆర్ఎస్ పార్టీ నాయకుల సెక్షన్‌తో లాంపెయిన్ యువతతో, వ్యాపారస్తులతో సంబంధాలు పెట్టుకొని సమాచారం తమకు.. డబ్బులు మీకు అని ప్రచారం చేస్తూ వారికి లేనిపోని ఆశలు కల్పిస్తూ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మార్చుకుంటున్నారని మండిపడ్డారు.


పోలీసుల ప్రోత్బలంతో కొంతమంది వ్యాపారస్తులు ప్రజలపై విపరీతమైన దోపిడీ చేస్తున్నారని అన్నారు. పోలీసులకు మామూలు ఇస్తూ కిరాణంలో వంట సరుకులు ఎక్కువగా తీసుకున్న కొత్త వ్యక్తులు కనబడ్డ వెంటనే సమాచారం చేరవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రాజకీయ నాయకులను వ్యాపారస్తులను, గ్రామాలను వారి కంట్రోల్లోకి తీసుకుంటున్నారని అన్నారు. అడవిలో దళాలు తిరిగితే వారికి తెలిపే విధంగా ఫారెస్ట్ వాళ్లను పెడుతూ సమాచారం వెంటనే పోలీసులకు చేరవేస్తున్నారన్నారు. గోదావరి ప్రాంత ఓడరేవులలో నీలంపల్లి, బుట్టాయిగూడెం, ముకునూరు, తుపాకులగూడెంతో పాటు అనేక రేవుల్లో నిఘా పెట్టి పోలీస్ ఇన్ఫార్మర్లు పోలీసులకు సమాచారం అందిస్తున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-31T17:28:25+05:30 IST