Mancherial: జెడ్పీ మీటింగ్కు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల గైర్హాజరు
ABN , First Publish Date - 2022-07-06T18:20:57+05:30 IST
జిల్లా జెడ్పీ సమావేశానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిదులు మూకుమ్మడిగా గైర్హాజరయ్యారు.
మంచిర్యాల: జిల్లా జెడ్పీ సమావేశానికి టీఆర్ఎస్ (TRs) ప్రజాప్రతినిదులు మూకుమ్మడిగా గైర్హాజరయ్యారు. కోరం లేక పోవడంతో చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు. చైర్ పర్సన్ కాంగ్రెస్లో చేరడంతో టీఆర్ఎస్ కినుక వహించింది. కాగా... కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , విపక్ష సభ్యులు సమావేశంలో పాల్గొనడానికి వచ్చారు. అయితే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల తీరుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.