పారిపోతూ ఏపీ-తెలంగాణ భవన్‌పై నుంచి కింద పడిన మహేశ్‌ బ్యాంకు నిందితుడు

ABN , First Publish Date - 2022-02-19T07:30:17+05:30 IST

పోలీసుల కన్నుగప్పి తప్పించుకోవాలని ప్రయత్నించిన మహేశ్‌ బ్యాంకు

పారిపోతూ ఏపీ-తెలంగాణ భవన్‌పై నుంచి కింద పడిన మహేశ్‌ బ్యాంకు నిందితుడు

న్యూఢిల్లీ/హిమాయత్‌నగర్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): పోలీసుల కన్నుగప్పి తప్పించుకోవాలని ప్రయత్నించిన మహేశ్‌ బ్యాంకు సర్వర్ల హ్యాకింగ్‌ కేసులో నైజీరియన్‌ నిందితుడు.. ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ ఉమ్మడి భవన్‌పై నుంచి కింద పడ్డాడు. అనంతరం నిందితుడిని  పోలీసులు అదుపులోకి తీసుకుని భవన్‌లోని గోదావరి బ్లాక్‌ 401లో గదిలో ఉంచారు. తర్వాత సీసీఎస్‌ పోలీసులకు సమాచారం అందడంతో వారు ఢిల్లీకి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 11 గంటలకు బాత్‌రూంకు వెళ్తానని చెప్పిన నిందితుడు పోలీసుల కన్నుగప్పి బాల్కనిలోకి వెళ్లారు. పైపులను పట్టుకొని కిందికి జారాలని ప్రయత్నించారు.  పట్టుతప్పి కింద పడడంతో గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. 


Updated Date - 2022-02-19T07:30:17+05:30 IST