రైస్ మిల్లుల్లో మొలకెత్తిన ధాన్యం
ABN , First Publish Date - 2022-07-19T05:00:52+05:30 IST
ఎడ తెరపిలేని వర్షాలతో మ మండలంలోని వివిధ రైస్ మి ల్లుల్లో ఉంచిన ధాన్యం బస్తా లు తడసి మొలకెత్తాయి.
మూసాపేట, జూలై 18 : ఎడ తెరపిలేని వర్షాలతో మ మండలంలోని వివిధ రైస్ మి ల్లుల్లో ఉంచిన ధాన్యం బస్తాలు తడసి మొలకెత్తాయి. మం డలంలో ఆరు రైస్మిల్లుల్లో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన దాదాపు మూడు లక్షల బ్యాగులను నిల్వ ఉంచారు. అ యితే అందులో లక్ష యాబై వేల బస్తాలు బియ్యంగా ఎఫ్ఐసీకి అప్పగించారు. గత నెల 7నుంచి ఎఫ్సీఐ బియ్యం సేక రించడం ఆపేసింది. దీంతో దాదాపు లక్షయాబైవేల బస్తాలు ఉండిపోయాయి. వర్షాలకు ఆరుబయట ఉన్న ధాన్యం బస్తాలు కొంత భాగం తడసి మొలకెత్తాయి.