సొసైటీ ఎన్నికల్లో గొర్రెల కాపరులు పాల్గొనాలి
ABN , First Publish Date - 2022-03-04T06:09:30+05:30 IST
మహబూబ్నగర్ జిల్లాలోని గొర్రెల పెంపకందారులు 14వ తేదీన నిర్వహించే సహకార సంఘం ఎన్నికల్లో పాల్గొనాలని ఎన్నికల అధికారి వేణుగోపాల్ గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
పాలమూరు, ఫిబ్రవరి 3 : మహబూబ్నగర్ జిల్లాలోని గొర్రెల పెంపకందారులు 14వ తేదీన నిర్వహించే సహకార సంఘం ఎన్నికల్లో పాల్గొనాలని ఎన్నికల అధికారి వేణుగోపాల్ గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎన్నికల్లో నిలబడాలనుకునే వారు ఐదవ తేదీ నుంచి నామినేషన్లు వేయవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు సంఘం కార్యాలయం, జిల్లా పశువైద్య, సంరక్షణ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ఈ-చలానాకు అనూహ్య స్పందన
- రెండ్రోజుల్లో రూ.41.32 లక్షలు చెల్లింపు
మహబూబ్నగర్, మార్చి 3 : ప్రభుత్వం ఈ చలానా పెండింగ్ వసూలు కోసం తీసుకు న్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. భారీగా రాయితీ ప్రకటించడంతో వాహన దారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రెండ్రోజుల్లోనే రూ.41.32 లక్షలు చెల్లింపులు చేశారు. జిల్లాలోని 18 మండలాల్లో తమ వాహనాలపై ఉన్న పెండింగ్ ఈ-చలానాలు చెల్లించేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. ఈ నెలాఖరు వరకు అవకాశం ఇవ్వడంతో సద్వినియోగం చేసుకోవాలని వాహనదారులు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1, 2 తేదీలలో 6198 కేసుల్లో రూ.41,32,375 ఈ-చలానా చెల్లింపులు జరిగాయి. ఈనెలాఖరు వరకు పెండింగ్ ఈ-చలానాలు దాదాపుగా వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.