రోడ్డు పనులు నాణ్యతగా చేపట్టాలి

ABN , First Publish Date - 2022-12-02T00:00:01+05:30 IST

రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆదేశించారు.

రోడ్డు పనులు నాణ్యతగా చేపట్టాలి

అమరచింత, డిసెంబరు 1: రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆదేశించారు. అమరచింత మండల పరిధిలోని మస్తీపూర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి జూరాల ప్రాజెక్టు వరకు వేస్తున్న బీటీ రోడ్డు పనులను గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్న జూరాల ప్రాజెక్టుకు వెళ్లే రహదారిని బాగు చేయాలని అనేకసార్లు సంబంధిత అధికారులతో చర్చించామన్నారు. పనులు నాణ్యతతో చేయాలని సదరు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మస్తీపూర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి జూరాల ప్రాజెక్టు వరకు బీటీ రోడ్డు వేయడం వల్ల ప్రయాణి కులు అందరికీ సౌకర్యం కలుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ బాల్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు చుక్క ఆశిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:00:03+05:30 IST