నేటి నుంచి జూపల్లి ఆత్మీయ సమ్మేళనాలు

ABN , First Publish Date - 2022-12-06T23:11:16+05:30 IST

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రాజకీయ ప్రస్ధానంపై జోరుగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి.

 నేటి నుంచి జూపల్లి ఆత్మీయ సమ్మేళనాలు

నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రాజకీయ ప్రస్ధానంపై జోరుగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. మునుగోడు ఎన్నిక తర్వాత జూపల్లి కృష్ణారావు దూకుడు పెంచనున్నారనే వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేప థ్యంలో జూపల్లి తన దూకుడు పెంచారు. కొల్లాపూర్‌లో ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆయన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో పాటు పరోక్షంగా టీఆర్‌ ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో బుధవారం నుంచి ప్రతీ ని యోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించదలచుకున్న ఆయన అచ్చం పేట నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగ ర్‌ జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆ యన తలపెట్టారు. నియోజకవర్గాల వారిగా అభిమానుల నుంచి వచ్చిన సూచ నల మేరకు భవిష్యత్తు రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - 2022-12-06T23:11:17+05:30 IST