100రోజుల్లో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలకు ప్రణాళిక
ABN , First Publish Date - 2022-12-06T23:09:52+05:30 IST
100రోజుల్లో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు 50 టీమ్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేసి నట్లు కలెక్టర్ పి.ఉదయ్కుమార్ అన్నారు.
- కలెక్టర్ పి.ఉదయ్కుమార్
నాగర్కర్నూల్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : 100రోజుల్లో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు 50 టీమ్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేసి నట్లు కలెక్టర్ పి.ఉదయ్కుమార్ అన్నారు. మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆయా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫ రెన్స్లో కలెక్టర్ పి.ఉదయ్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ నాగర్కర్నూల్ జిల్లా మొత్తం 8,66,498 జనాభా కలిగి ఉన్నారన్నారు. కం టి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయబోయే టీంలలో 42 గ్రామీణ టీం లు కాగా 8 మునిసిపాలిటీల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనంగా 5 టీంల ను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అద నపు కలెక్టర్ మనూచౌదరి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.సుధాకర్లాల్, మునిసిప ల్ కమిషనర్ జయంతికుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.