పంటలకు రక్షణ కల్పించాలి
ABN , First Publish Date - 2022-03-05T05:02:05+05:30 IST
అడవి జంతువుల దాడి నుంచి పంటలను రక్షించాలని బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు కావలి వెంకటేష్ కోరారు.
- తహసీల్దార్ కార్యాలయం ముందు రైతుల ధర్నా
మక్తల్, మార్చి 4: అడవి జంతువుల దాడి నుంచి పంటలను రక్షించాలని బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు కావలి వెంకటేష్ కోరారు. మండలంలోని వివిధ గ్రామాల్లో రైతు ల పంటలను నాశనం చేస్తున్న అడవి జంతువుల బారి నుంచి పంటలు కాపాడాల ని డిమాండ్ చేస్తూ బీకేఎస్ ఆధ్వర్యంలో రాంలీలా మైదానం నుంచి తహసీల్దార్ కా ర్యాలయం వరకు దండు, కర్ని, ఖానాపూర్, రుద్రసముద్రం, గోలపల్లి, కాచ్వార్ గ్రా మాల రైతులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం వద్ద బీకేఎస్ ఆధ్వ ర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు కావలి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ పొలాల్లో వేసుకున్న వరి, ఇతర పంటలను అడవి జంతువులు నాశనం చేస్తున్నాయన్నారు. ఆరుగాలం కష్టించినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు బీజేపీ నాయకుడు కొండయ్య, పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో బీకేఎస్ మండల అధ్యక్షుడు కర్ని శ్రీనివాసులు, జిల్లా నాయకులు కాళేశ్వర్, రైతులు మధుసూదన్ రెడ్డి, నారాయణ, రాములు పాల్గొన్నారు.