స్థల వివాదంలో ఘర్షణ

ABN , First Publish Date - 2022-12-09T23:21:03+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ప్రైవేటు స్థలంలో నిర్మాణానికి సంబం ధించిన వివాదంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నడుమ ఘర్షణ చెలరేగింది.

స్థల వివాదంలో ఘర్షణ

వెల్దండ, డిసెంబరు 9 : నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ప్రైవేటు స్థలంలో నిర్మాణానికి సంబం ధించిన వివాదంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నడుమ ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పీఏసీఎస్‌ డైరెక్టర్‌ సంజీవ్‌కుమార్‌పై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వెంకటయ్యగౌడ్‌ అనుచరులు దాడి చేశారు. దీంతో సంజీవ్‌కుమార్‌ తలకు గాయమైంది. సంజీవ్‌కుమార్‌ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా సంజీవ్‌కుమార్‌ వర్గం తమపై దాడికి పాల్పడినట్లు వెంకటయ్యగౌడ్‌ ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-12-09T23:21:04+05:30 IST