అంబరాన్నంటిన బీఆర్‌ఎస్‌ సంబురాలు

ABN , First Publish Date - 2022-12-09T23:51:40+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన సందర్భంగా శుక్రవారం ఆ పార్టీ శ్రేణులు పట్టణంలోని సంబురాలు చేసుకున్నారు.

అంబరాన్నంటిన బీఆర్‌ఎస్‌ సంబురాలు
పార్టీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్‌ సంబురాలు చేసుకుంటున్న నాయకులు

- బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిన గులాబీ శ్రేణులు

మహబూబ్‌నగర్‌/ హన్వాడ/ నవాబ్‌పేట, డిసెంబరు 9 : టీఆర్‌ఎస్‌ పార్టీ భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన సందర్భంగా శుక్రవారం ఆ పార్టీ శ్రేణులు పట్టణంలోని సంబురాలు చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ముందు బాణసంచాకాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. జై బీఆర్‌ఎస్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముడా చైర్మన్‌ వెంకన్న మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ ఆధ్వర్యంలో దేశంలో సంచలనం సృష్టించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోందన్నారు. వచ్చే ఎన్నికలో రాష్ట్రంలో దేశంలో బీఆర్‌ఎస్‌ సత్తా చూపనుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్‌, నాయకులు శ్రీకాంత్‌గౌడ్‌, కట్టా రవి కిషన్‌రెడ్డి, పటేల్‌ ప్రవీణ్‌, షబ్బీర్‌అలీ, ము నీరుద్దీన్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఉమర్‌, అంజద్‌, ఖాజాపాషా, రామలింగం, చిన్న హన్మంతు, లక్ష్మణ్‌ నాయక్‌ పాల్గొన్నారు.

- హన్వాడలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మిఠాయిలు పంచి, పటాకులు పేల్చి సంబురాలు జరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రమణా రెడ్డి, బాలయ్య, బాలరాజు, రాములు, జంబులయ్య, సత్యం, కృష్ణయ్యగౌడ్‌, మోహన్‌, మాధవులు, వెంకటయ్య, నాగన్న, బసిరెడ్డి పాల్గొన్నారు.

- నవాబ్‌పేట మండలం పర్వతాపూర్‌ మైసమ్మ వద్ద టీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల అధ్యక్షుడు మెండె శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయ కులు సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు సుప్ప ప్రకాష్‌, బంగారు, వెంకటేష్‌, విరేష్‌, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:51:44+05:30 IST