త్వరలో బర్డ్స్ ఎన్క్లోజర్
ABN , First Publish Date - 2022-11-12T23:17:24+05:30 IST
కేసీఆర్ అర్బ న్ ఎకోపార్క్ను దేశంలోనే నెంబర్వన్ పార్క్గా అభివృద్ధి చేసుకున్నామని, త్వరలోనే ఇక్కడ బర్డ్స్ ఎన్ క్లోజర్ను ఏర్పాటు చేసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
-800 రకాల పక్షలతో ఏర్పాటుకు చర్యలు
- రూ.3 కోట్ల నిధులు విడుదల
- మంత్రి వి శ్రీనివాస్గౌడ్
- కేసీఆర్ అర్బన్ ఎకోపార్క్లో ఆహ్లాదంగా కార్తీక వనభోజనాలు
మహబూబ్నగర్, నవంబరు 12 : కేసీఆర్ అర్బ న్ ఎకోపార్క్ను దేశంలోనే నెంబర్వన్ పార్క్గా అభివృద్ధి చేసుకున్నామని, త్వరలోనే ఇక్కడ బర్డ్స్ ఎన్ క్లోజర్ను ఏర్పాటు చేసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ రోజే బర్డ్స్ ఎన్క్లోజర్ కోసం రూ.3 కోట్లు మంజూ రయ్యాయని ఆ యన తెలిపారు. శనివారం గౌడ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వ ర్యంలో కేసీఆర్ ఆర్బన్ ఎకోపార్క్లో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మహిళా ఉద్యో గులు కోలాటాలతో సందడి చేశారు. చిన్నారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శన చేశారు. మంత్రి శ్రీని వాస్గౌడ్ చిన్నారులకు బహుమతులను అందజే శారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎకరా స్థలంలో దేశ, విదేశాల నుంచి 800 రకాల పక్షల ను తీసుకువచ్చి ఇక్కడ వదులుతామని చెప్పారు. భావితరాలకు అన్ని రకాల పక్షులను చూయించి, వారిలో మేధాశక్తిని పెంపొందించేందుకు ఈ ఎన్ క్లోజర్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అర్బన్ పార్క్లో కార్తీక వనభోజనాల కోసం ఉసిరి చెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. మహబూబ్ నగర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలిపా రు. ఈ కార్యక్రమంలో విశ్రాంత, ఉద్యోగుల సం ఘం నాయకులు వెంకటస్వామిగౌడ్, రాజయ్యగౌడ్, లక్ష్మణ్గౌడ్, చక్రవర్తిగౌడ్, రవీందర్గౌడ్, గోపాల్ గౌడ్, నారాయణగౌడ్, వెంక య్యగౌడ్, సత్యనారా యణగౌడ్, దనుంజయ్గౌడ్ పాల్గొన్నారు.