పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2022-09-22T05:08:47+05:30 IST

వచ్చేనెల 16న నిర్వహించనున్న తె లంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ -1 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీ) ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు ఆదే శించారు.

పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

-అదనపు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

- గ్రూప్‌-1 పరీక్షా కేంద్రాలు పరిశీలన

వనపర్తి రూరల్‌,సెప్టెంబరు21: వచ్చేనెల 16న నిర్వహించనున్న తె లంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ -1 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీ) ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు ఆదే శించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని గిరిజన సంక్షేమ పాఠశాల, సీవీ రామన్‌ కళాశాల, మదర్స్‌ లాప్‌ పాఠశాలలో గ్రూప్‌- 1 పరీక్ష కేంద్రాలను ఆయన పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో గ్రూప్‌- 1 పరీక్ష నిర్వహిం చేందుకు 19 కేంద్రాలను ఏర్పాట్లు  చేసి నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో ఫర్నిచర్‌, టాయిలెట్స్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి, విద్యుత్‌ సౌకర్యాలు, పార్కింగ్‌, మొబైల్‌ ఫోన్స్‌, బ్యాగ్స్‌ సౌకర్యం కోసం ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదే శించారు.  అదనపు కలెక్టర్‌ వెంట డీ ఐఈవో జాకీర్‌ హుస్సేన్‌, గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసులు, తహస్దీలార్‌  రాజేందర్‌ గౌడ్‌, కమిష నర్‌, విక్రమ్‌ సింహారెడ్డి, పాఠశాలల, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-09-22T05:08:47+05:30 IST