పాఠశాలలో ‘సర్వేపల్లి’ కాంస్య విగ్రహం ఏర్పాటు
ABN , First Publish Date - 2022-12-09T23:56:01+05:30 IST
మండల కేంద్రమైన మూసాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 1980-81 బ్యాచ్కు చెందిన విద్యార్థులు లక్షా 25 వేలతో చేయించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం అందజేశారు.
మూసాపేట, డిసెంబరు 9 : మండల కేంద్రమైన మూసాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 1980-81 బ్యాచ్కు చెందిన విద్యార్థులు లక్షా 25 వేలతో చేయించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం అందజేశారు. వీరు గత ఆగస్టు 7న సమావేశమై నప్పుడు పాఠశాలకు గుర్తింపుగా దివంగత భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. పూర్వ విద్యార్థులను గ్రామస్థులు అభినందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శెట్టి శేఖర్, పూర్వ విద్యార్థులు గిన్నే వెంకటేశ్వర్లు సాగర్, శ్రీనివాసరెడ్డి, గోవర్ధన్, శేఖర్, ఓంకార్, రంగారెడ్డి, సంజీవరెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకట్రెడ్డి ఉన్నారు.