కోర్టు భవన నిర్మాణానికి 10 ఎకరాలు
ABN , First Publish Date - 2022-12-06T23:00:00+05:30 IST
మహబూబ్ నగర్లో అధునాతన కోర్టు భవనాన్ని నిర్మించేందుకు 10 ఎకరాల స్థలం కేటాయి స్తూ మంగళవారం ప్రభు త్వం జీవో నెంబర్ 141 విడుదల చేసింది.
పశుసంవర్థక శాఖకు చెందిన స్థలం న్యాయశాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీనివాస్గౌడ్
అన్ని హంగులతో భవనాన్ని నిర్మించుకునేందుకు తొందర్లోనే టెండర్లు పిలుస్తామని వెల్లడి
మహబూబ్నగర్, డిసెం బరు 6: మహబూబ్ నగర్లో అధునాతన కోర్టు భవనాన్ని నిర్మించేందుకు 10 ఎకరాల స్థలం కేటాయి స్తూ మంగళవారం ప్రభు త్వం జీవో నెంబర్ 141 విడుదల చేసింది. పట్టణ సమీపంలోని బండ మీదిపల్లి పశుసంవర్థక శాఖకు చెందిన 10 ఎక రాల స్థలం న్యాయశాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ముఖ్య మంత్రి కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కోర్టు కాంప్లెక్స్లో ఒకేచోట 16 కోర్టు సముదాయాలు ఉన్నందున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే నూతన భవనాన్ని అన్ని హంగులతో భవనాన్ని నిర్మించుకునేందుకు తొందరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి పేర్కొన్నారు.