TS News: మంత్రగత్తెల నెపంతో దంపతులపై దాడి
ABN , First Publish Date - 2022-10-11T17:12:50+05:30 IST
జిల్లాలోని లక్ష్మీపురంలో దారుణం జరిగింది. మంత్రగత్తెల నెపంతో ముత్తంగుల రామచంద్రు, ఐలమ్మ దంపతులపై గ్రామస్థులు దాడి చేశారు.
మహబూబాబాద్: జిల్లాలోని లక్ష్మీపురంలో దారుణం జరిగింది. మంత్రగత్తెల నెపంతో ముత్తంగుల రామచంద్రు, ఐలమ్మ దంపతులపై గ్రామస్థులు దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ దంపతులు ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల గ్రామంలో చనిపోయిన వ్యక్తి మృతికి రామచంద్రు, ఐలమ్మ మంత్రాలు కారణమంటూ బంధువులు దాడి చేశారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.