17ను చీకటి రోజుగా పాటిద్దాం: మావోయిస్టు పార్టీ

ABN , First Publish Date - 2022-09-08T09:43:24+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

17ను చీకటి రోజుగా పాటిద్దాం: మావోయిస్టు పార్టీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. బీజేపీ సెప్టెంబరు 17న విముక్తి దినంగా పాటించాలని నిర్ణయిస్తే... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని ప్రకటించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎత్తుగడలు చరిత్రను వక్రీకరించడమేనని.. అందుకే ఆనాడు చీకటి రోజుగా పాటించాలని పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో  మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2022-09-08T09:43:24+05:30 IST