హార్వర్డ్ ఇండియా సదస్సులో ప్రసంగించనున్న కేటీఆర్
ABN , First Publish Date - 2022-02-19T06:48:36+05:30 IST
హార్వర్డ్ ఇండియా సదస్సులో ప్రసంగించాలని పురపాలక శాఖ మంత్రి
హార్వర్డ్ ఇండియా సదస్సులో ప్రసంగించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సు ఆదివారం వరకు జరుగుతుంది. ఈనెల 20న సాయంత్రం 6:30 గంటలకు మంత్రి కేటీఆర్ వర్చువల్ విధానంలో ప్రసంగిస్తారు. తెలంగాణలో సులభతర వాణిజ్యంతో పాటు ఇతర కార్యక్రమాల అమలులో తీసుకుంటున్న నిర్ణయాలను ఈ సదస్సులో పంచుకోనున్నారు. తనను ఆహ్వానించినందుకుగాను నిర్వాహకులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.