Rmp Sold a Baby: పసికందును అమ్మేసిన ఆర్ఎంపీ... తన బిడ్డ కావాలని తల్లి ఆందోళన

ABN , First Publish Date - 2022-07-20T23:36:51+05:30 IST

జిల్లాలో పసికందు అమ్మకం (Baby Sold) కలకలం రేపుతోంది. తన బిడ్డను తనకు ఇవ్వాలని తల్లి (Mother) ఆందోళన చేయడంతో ఈ...

Rmp Sold a Baby: పసికందును అమ్మేసిన ఆర్ఎంపీ... తన బిడ్డ కావాలని తల్లి ఆందోళన

కొమురంభీంఆసీఫాబాద్: జిల్లాలో పసికందు అమ్మకం (Baby Sold) కలకలం రేపుతోంది. తన బిడ్డను తనకు ఇవ్వాలని తల్లి (Mother) ఆందోళన చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రెబ్బన మండలం గోలేటి టౌన్ షిప్పులోని ఆర్ఎంపీ వైద్యుడు మనోహర్ (Rmp Manohar)‎కు మంచిర్యాలకు చెందిన మంజుల (Manjula)తో పరిచయం ఉంది. గత నెలలో ఆమె మంచిర్యాల (mancherial)లో ప్రసవించారు. సిజేరియన్ జరగడంతో ఆమెకు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆమెకు ఎవరి సహాయం లేకపోవడంతో బిడ్డ ఆలనా.. పాలనా చూడటం ఇబ్బందిగా మారింది. దీంతో తనను చూసేందుకు వచ్చిన ఆర్ఎంపీ డాక్టర్ మనోహర్‎కు అప్పగించింది. ఆరోగ్యం కుదుటపడ్డాక ఇస్తానని చెప్పి పాపను తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మంజుల తన పాప కోసం మనోహర్‌కు ఫోన్ చేశారు. అతను స్పందించకపోవడంతో మనోహర్ స్వగ్రామం గోలేటికి మంజుల వెళ్లారు.


ఈ క్రమంలో పాప తన వద్ద లేదని అమ్మేశామని ఆర్ఎంపీ చెప్పడంతో పోలీసులకు మంజుల ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారించగా పాపను అప్పగిస్తామని చెప్పి ఆ తర్వాత ఆర్ఎంపీ అందుబాటులో లేకుండా పోయారు. దీంతో మంజులు.. ఆర్ఎంపీ ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. తన పాపను అప్పగించి.. తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మంజులకు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి.




Updated Date - 2022-07-20T23:36:51+05:30 IST