TS News: మునుగోడు ఉపఎన్నికలో చరిత్ర సృష్టించే తీర్పు ఇవ్వాలి: కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2022-09-25T22:27:39+05:30 IST
మునుగోడు ఉపఎన్నిక(MUNUGODU by election) లో చరిత్ర సృష్టించే తీర్పు ప్రజలు ఇవ్వాలని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి(Komati Reddy Rajagopal Reddy) అన్నారు.
యాదాద్రి(Yadadri): మునుగోడు ఉపఎన్నిక(MUNUGODU by election) లో చరిత్ర సృష్టించే తీర్పు ప్రజలు ఇవ్వాలని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి(Komati Reddy Rajagopal Reddy) అన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ మండలం ఖైతాపురం, కొయ్యలగూడెం పలు గ్రామాల్లోని వివిధ పార్టీల నుంచి 400 మంది కార్యకర్తలు రాజగోపాల్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. . ఎంతోమంది బలిదానాలతో తెలంగాణ వచ్చిందని కానీ కేసీఆర్ కుటుంబం పాలన చేస్తోందని మండిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో అనవసర ప్రాజెక్ట్లు నిర్మించి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి దుయ్యబట్టారు.