పేదలకు సేవలందించడమే బత్తినేని ట్రస్టు ధ్యేయం

ABN , First Publish Date - 2022-01-03T06:31:35+05:30 IST

పేదలకు సేవలందించడమే బత్తినేని చారిటబుల్‌ ట్రస్టు ధ్యేయమని ట్రస్టు సభ్యులు,ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షురాలు బత్తినేని నీరజ తెలిపారు.

పేదలకు సేవలందించడమే బత్తినేని ట్రస్టు ధ్యేయం
మందులు పంపిణీ చేస్తున్న బత్తినేని నీరజ

ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షురాలు నీరజ

బోనకల్‌, జనవరి2: పేదలకు సేవలందించడమే బత్తినేని చారిటబుల్‌ ట్రస్టు ధ్యేయమని ట్రస్టు సభ్యులు,ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షురాలు బత్తినేని నీరజ తెలిపారు. బోనకల్‌లో ఆదివారం తూము ప్రకాశ్‌రావు జ్ఞాపకార్ధం బత్తినేని ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. సందర్బంగా మాట్లాడుతూ నిరు పేదలకు తమ ట్రస్టు ద్వారా విద్యా,వైద్య రంగాలలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. బోనకల్‌ మండలంలో ప్రతివారం మెగాశ్రీ ఆసుపత్రి ద్వారా తమ ట్రస్టు నుంచి పేదలకు ఉచిత వైద్య సేవలందించే వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షులు మేదరమట్ల స్వరూపరాణి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ప్రభావతి, ట్రస్టు సభ్యులు తూము రోషన్‌కుమార్‌,వైస్‌ ఎంపీపీ గుగులోత్‌ రమేష్‌,వైద్య నిపుణులు ఉదయ్‌కిరణ్‌, సీపీఐ మండల కార్యదర్శి వెంగల ఆనందరావు, కట్టా రాములమ్మ,బొమ్మినేని కొండలరావు, ఆకిన పవన్‌ తదితరలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-03T06:31:35+05:30 IST