ప్రాథమిక విద్య బలోపేతమే లక్ష్యం
ABN , First Publish Date - 2022-09-13T06:01:55+05:30 IST
ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు డీఈవో సోమశేఖర్శర్మ అన్నారు.
డీఈవో సోమశేఖర శర్మ
కొత్తగూడెం కలెక్టరేట్, సెప్టెంబరు 12: ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు డీఈవో సోమశేఖర్శర్మ అన్నారు. సోమవారం జిల్లాలో తొలిమెట్టు కార్యక్రమాన్ని సింగరేణి ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల మౌలిక భాష, గణిత సామర్థ్యాలను పెంపొందించడంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు కృషి చేయాలన్నారు. తొలిమెట్టు కార్యక్రమం పర్యవేక్షణ అధికారులకు రెండు రోజుల శిక్షణా ఆయన ప్రారంభించారు. ప్రాఽథమిక పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం, మౌలిక గణిత భావనలు తప్పనిసరిగా నేర్పించాల్సిన బాధ్యత ఆయా ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న తొలిమెట్టు కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వం రూపొందించిన టాంజిరిన్ యాప్ను ప్రతి ఒక్కరు తమ మొబైల్లో డౌన్లోడు చేసుకొని దాని ద్వారా పర్యవేక్షణను చేయాలన్నారు. ఈ యాప్ వినియోగంలో ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా శిక్షణను వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్గా జిల్లా విద్యాశాఖ ఎకడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్, రిసోర్్స్ పర్సన్గా టి రమ, కె శ్రీనివాసరావు, బి విష్ణుప్రియ, టి శ్రీనివా్సరెడ్డి, ఎస్ రాజశేఖర్, వి కోటేశ్వరరావులు వ్యవహరిస్తారన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో హాజరు రిజిస్టర్లో ఉన్నప్రతి విద్యార్థి వివరాలు రాష్ట్ర ప్రభుత్వ చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో తప్పని సరిగా నమోదు చేయాలని జిల్లా గణాంక అధికారి సతీష్ కుమార్ను ఆదేశించారు.