సీఎం కేసీఆర్‌ హిందూ ద్రోహి

ABN , First Publish Date - 2022-12-06T23:18:21+05:30 IST

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హిందూ ద్రోహి అని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌ హిందూ ద్రోహి
మాట్లాడుతున్న శ్రీనివాసానంద సరస్వతి

భద్రాచలం, డిసెంబరు 6: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హిందూ ద్రోహి అని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. భద్రాచలంలోని సీతారామస్వామి వారిని శ్రీనివాసానంద సరస్వతి మం గళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మత విద్రో హ శక్తులను ప్రోత్సహిస్తున్నారన్నారని విమర్శించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక భద్రాద్రి రామయ్యకు చేసిందేమీ లేదన్నారు. ఏపీలోని పురుషోత్తపట్నంలో 917 ఎకరాల రామయ్య భూములు కబ్జాకు గురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా సత్యవతి, ములిశెట్టి రామ్మోహన్‌రావు, వెంకన్న, కేశవ్‌, శ్రీహరి, వెంకటేశ్వర్లు, ఉపేందర్‌, జయరాజు, నిఖిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:18:23+05:30 IST