పాఠశాలలో నూరుశాతం హాజరు ఉండాలి

ABN , First Publish Date - 2022-02-17T05:09:43+05:30 IST

పాఠశాలల్లో నూరుశాతం విద్యార్థుల హాజరుశాతం ఉండాలని, ప్రతీ విద్యార్థి తరగతి హాజరయ్యేలా ఉపాధ్యాయయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని కలెక్టర్‌ వీపీగౌతమ్‌ ఆదేశించారు.

పాఠశాలలో నూరుశాతం హాజరు ఉండాలి
విద్యార్థులతో మాట్లాడతున్న కలెక్టర్‌ గౌతమ్‌

 కలెక్టర్‌ గౌతమ్‌ అవగాహన

ఖమ్మంఖానాపురంహవేలి, ఫిబ్రవరి16: పాఠశాలల్లో నూరుశాతం విద్యార్థుల హాజరుశాతం ఉండాలని, ప్రతీ విద్యార్థి తరగతి హాజరయ్యేలా ఉపాధ్యాయయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని కలెక్టర్‌ వీపీగౌతమ్‌ ఆదేశించారు. మంగళవారం మనబస్తీ- మనబడి కార్యక్రమంలో భాగంగా నగరంలోని మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శసురభితో కలిసి సందర్శించారు. మనబస్తీ-మనబడి కింద మామిళ్లగూడెం పాఠశాల ఎంపికైన నేపథ్యంలో.. పాఠశాలల విద్యార్థులకు అవసరమైన వసతులు సమకూర్చుకొనేందుకు  విద్యా కమిటీలు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్‌ అఽధికారుల సమన్వయంతో మొదటి ప్రాధాన్యతగా గుర్తించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతోపాటు పాఠాన్ని విని ఉపాధ్యా యులకు సిలబస్‌పట్ల పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో డీఈవో ఎస్‌.యాదయ్య, అర్బన్‌ ఎంఈవో శ్రీనివాస్‌, ధరణికుమార్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-02-17T05:09:43+05:30 IST