ఓటర్జాబితా ఆధారంగా వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2022-01-24T03:55:59+05:30 IST
ఓటర్లిస్ల్ ఆధారంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని నగరపాలకసంస్థ కమిషనర్ ఆదర్్శ్సురభి సిబ్బందిని ఆదేశించారు.
ఖమ్మం కార్పొరేషన్, జనవరి 23: ఓటర్లిస్ల్ ఆధారంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని నగరపాలకసంస్థ కమిషనర్ ఆదర్్శ్సురభి సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం నగరంలోని 24వ డివిజన్లో ఆయన పర్యటించి వ్యాక్సిన్ ప్రక్రియను, ఇంటింటి జ్వర సర్వేలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లిస్ట్ను పరిశీలించి, వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి, వారికి వ్యాక్సిన్లు వేయించారు. జ్వర సర్వేలో లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్లు ఇప్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కమర్తపు మురళి, అంగన్ వాడీ, వైద్య, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు
ముమ్మరంగా జ్వరసర్వే, వ్యాక్సినేషన్
స్వరసర్వే, వ్యాక్సినేషన్ ప్రక్రియలో 60 డివిజన్ల కార్పోరేటర్లు భాగస్వాములు కావాలని కమిషనర్ ఆదర్శ్సురభి సూచించారు. ఈ నేపథ్యంలో పలు డివిజన్లలో కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. 53వ డివిజన్లో ఇంటింటి ఫీవర్సర్వే రెండోరోజులో కార్పోరేటర్ పగడాల శ్రీవిద్య పాల్గొన్నారు. అవసరమైన వారికి కరోనా కిట్లు అందించారు. టీకా వేసుకొని వారిని గుర్తించి, వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించారు. 6వ డివిజన్లో కార్పోరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికీ తిరిగారు. జ్వరసర్వే, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.