ఇరు జిల్లాల్లో భారీవర్షం

ABN , First Publish Date - 2022-09-20T05:21:05+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసింది. పలుప్రాంతాల్లో 4సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో ఖమ్మంతో పాటు సత్తుసల్లి, తల్లాడ, కామేపలి,్ల కారేపల్లి, తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. మధిర, కూసుమంచిలో ఒక మోస్తరు వర్షం కురి

ఇరు జిల్లాల్లో భారీవర్షం

 పలుప్రాంతాల్లో 4సెం.మీ పైగా వర్షపాతం నమోదు

ఖమ్మం కార్పొరేషన/కొత్తగూడెం, సెప్టెంబరు 19: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసింది. పలుప్రాంతాల్లో 4సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో ఖమ్మంతో పాటు సత్తుసల్లి, తల్లాడ, కామేపలి,్ల కారేపల్లి, తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. మధిర, కూసుమంచిలో ఒక మోస్తరు వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచే ముసురుతో వాతావరణం చల్లబడింది. కారేపల్లిమండలం కేంద్రంతో పాటు కామేపల్లి మండలం లింగాలలో అత్యధికంగా 4.84సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం కురిసిన వర్షాలకు జిల్లాలో మిర్చిరైతులకు ప్రయోజనం చేకూరనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు మండలాల్లో సోమవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోని అశ్వాపురం మండలంలో అత్యధికంగా 4సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలతో జిల్లాలోని పలు మండలాల్లో చిన్నపాటి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. 

Updated Date - 2022-09-20T05:21:05+05:30 IST