ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా

ABN , First Publish Date - 2022-11-27T22:55:11+05:30 IST

శిథిలావస్థలో టీఎల్‌పేట చప్టా. నిర్లక్ష్య ధోరణిలో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు

ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా
ప్రమాదకరంగా ఉన్న చప్టా

ఏన్కూరు, నవంబరు 27: చప్టా శిఽథిలావస్థలో ప్రమాదకరంగా ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగేంత వరకు పట్టించుకోరా అని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఏన్కూఉ నుంచి తిమ్మరావుపేట వెళ్ళే ప్రధాన రహదారి లో తూతుక్కలింగన్నపేట గ్రామ సమీపంలోని చప్టా కూలేందుకు సిద్ధంగా ఉంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ చప్టా శిఽథిలావస్థకు చేరింది. చెరవు అలుగు నీరు మొత్తం చప్టా మీదుగానే ప్రవహిస్తూ ఉంటుంది. ఏడాది కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ రహదారి మీదుగా నిత్యం ఖమ్మం, ఇల్లెందుకు వేలాది వాహనాలు వెళ్తుంటాయి. ప్రమాదకరంగా ఉన్న చప్టా దగ్గర ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2022-11-27T22:55:31+05:30 IST