ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం ఎంచుకోవాలి
ABN , First Publish Date - 2022-12-10T00:08:55+05:30 IST
ప్రజల ఆరోగ్యాలతో చలగాటం ఆడుతున్న ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఉన్న బయోడీగ్రేడబుల్ కంపోస్టు ప్లాస్టిక్ వస్తువులను ఎంచుకోవాలని ఇల్లెందు మునిసిపల్ కమిషనర్ అంకుషావళి సూచించారు.
ఇల్లెందుటౌన్, డిసెంబరు 9: ప్రజల ఆరోగ్యాలతో చలగాటం ఆడుతున్న ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఉన్న బయోడీగ్రేడబుల్ కంపోస్టు ప్లాస్టిక్ వస్తువులను ఎంచుకోవాలని ఇల్లెందు మునిసిపల్ కమిషనర్ అంకుషావళి సూచించారు. శుక్రవారం మునిసిపల్ కార్యాలయంలో పట్టణ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వచ్చ సర్వేక్షణ్లో భాగంగా పట్టణంలో పారిశుధ్య చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్ వస్తువులు, సంచుల మూలంగా పర్యావరణం అనేక విధాలుగా నష్టపోతుందని తద్వారా మానవళికి అనేక సవాళ్లు ఎదురువుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా వస్తున్న సంచులు త్వరితగతిన భూమిలో కలిసి పోయ్యే కంపోస్టుగా మారుతున్నాయని వివరించారు. హైదరబాద్కు చెందిన బయో డీగ్రేడబుల్ కంపోస్టు సంస్థ ప్రత్యామ్నాయసంచులను తయారు చేస్తుందని వివరించారు. ఈ సమావేశంలో మునిసిపల్ అధికారులు, పట్టణ వ్యాపారులు పాల్గొన్నారు.