ఇరు జిల్లాల్లో 30 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-02-19T06:27:44+05:30 IST
ఇరు జిల్లాల్లో 30 కరోనా కేసులు
ఖమ్మం కలెక్టరేట్/కొత్తగూడెం కలెక్టరేట్, ఫిబ్రవరి 18: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 30కరోనా కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 2,609మందికి పరీక్షలు నిర్వహించగా 25, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,033 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఐదు పాజిటివ్ కేసులు నమోద య్యాయి. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో శుక్రవారం ఒకరు చేరారు. ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 320 బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 16మంది చికిత్స పొందుతున్నారు. 304బెడ్లు ఖాళీగా ఉన్నాయి.